rajani: గ్రాండ్ ఈవెంట్ నుంచి రానున్న '2.ఓ' ట్రైలర్

  • '2.ఓ'ను తీర్చిదిద్దుతోన్న శంకర్ 
  • వచ్చేనెల 3వ తేదీన ట్రైలర్ 
  • 29వ తేదీన సినిమా రిలీజ్

శంకర్ దర్శకత్వంలో '2.ఓ' చిత్రం రూపొందింది. ఈ సినిమాను తీర్చిదిద్దే పనిలోనే ప్రస్తుతం శంకర్ వున్నాడు. రజనీకాంత్ అభిమానులు .. అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వచ్చేనెల 3వ తేదీన ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా చెప్పారు. దాంతో సోషల్ మీడియా ద్వారా ఈ ట్రైలర్ ను వదులుతారేమోనని అనుకున్నారు.

కానీ వచ్చేనెల 3వ తేదీన చెన్నైలో గ్రాండ్ గా ఒక ఈవెంట్ ను నిర్వహిస్తారట. ఈ సినిమాకి సంబంధించిన నటీనటులు .. సాంకేతిక నిపుణులు .. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకి హాజరవుతారట. వాళ్లందరి సమక్షంలో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఎమీ జాక్సన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను వచ్చేనెల 29వ తేదీన విడుదల చేయనున్నారు.  

More Telugu News