nagachaitanya: 'సవ్యసాచి'పై క్రేజ్ .. ఒక రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్

  • 'సవ్యసాచి'గా నాగచైతన్య 
  • దిల్ రాజుకి నైజామ్ ఏరియా హక్కులు
  • నవంబర్ 2వ తేదీన భారీ రిలీజ్  

నాగచైతన్య కథానాయకుడిగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'సవ్యసాచి' సినిమా రూపొందింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, వచ్చేనెల 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. గతంలో చందూ మొండేటి - నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన 'ప్రేమమ్' ఘన విజయాన్ని అందుకుంది. దాంతో ఈ కాంబినేషన్లో వస్తోన్న 'సవ్యసాచి'పై అంచనాలు పెరిగిపోయాయి.

ఈ కారణంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగిందని చెబుతున్నారు. నాగచైతన్య కెరియర్లోనే గతంలోనే ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా 22.32 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుందని అంటున్నారు. ఈ  సినిమాకి సంబంధించిన నైజామ్ ఏరియా హక్కులను దిల్ రాజు 6 కోట్లకు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ కనిపించనున్న సంగతి తెలిసిందే. 

More Telugu News