rajasekhar: రాజశేఖర్ సినిమాలో ఇద్దరు కథానాయికలు

  • రాజశేఖర్ హీరోగా 'కల్కి'
  • నందిత శ్వేత లేనట్టే 
  • ఒక కథానాయికగా ఆదా శర్మ

'గరుడ వేగ' తరువాత మంచి కథ కోసం వెయిట్ చేస్తూ రాజశేఖర్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవల ఆయనకి 'అ!' సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక కథ వినిపించాడు. ఆ కథ నచ్చడంతో వెంటనే రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సి.కల్యాణ్ తో కలిసి రాజశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

'కల్కి' టైటిల్ తో 1980ల నాటి కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా నందిత శ్వేత నటించనుందనే వార్తలు వచ్చాయి. అయితే ఆమె ఎంపిక ఖరారు కాలేదని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆదా శర్మను .. 'బాహుబలి'లో స్పెషల్ సాంగ్ చేసిన 'స్కార్ లెట్ విల్సన్' ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. 'టైటిల్ కైతే మంచి మార్కులు పడ్డాయి .. ఇక సినిమా ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందో చూడాలి.    

More Telugu News