Tirumala: వెంకన్నకు వితరణ... రూ. 1,11,11,111 కానుకిచ్చిన రిలయన్స్!

  • అవసరమైన పథకానికి వినియోగించుకోవచ్చు 
  • టీటీడీ అధికారులతో రిలయన్స్ ప్రతినిధులు
  • స్వామివారి దర్శనం చేయించిన అధికారులు

పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి రూ. 1,11,11,111ను విరాళంగా ఇచ్చింది. దేవస్థానానికి అవసరమైన పథకానికి ఈ నిధులను వినియోగించుకోవాలని సూచించింది. రిలయన్స్ తరఫున సంస్థ సీఈఓలు పీ మధుసూదన ప్రసాద్, వీవీఎల్ మాధవరావులు ఈ చెక్కును డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ కు అందించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన వీరు, అనంతరం చెక్కును అందించారు. వారికి ఆశీర్వచనం పలికిన పండితులు, ఆపై లడ్డూ ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని అందించారు.

More Telugu News