buddha venkanna: టీడీపీ అధికార ప్రతినిధిగా బుద్ధా వెంకన్న.. ప్రకటించిన చంద్రబాబు

  • పార్టీ సమావేశంలో నిర్ణయాన్ని వెల్లడించిన చంద్రబాబు
  • పార్టీ వాణిని వినిపించడంలో ముందుంటున్నారని ప్రశంస
  • అభినందించిన నేతలు

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఎమ్మెల్సీ, శాసనమండలి విప్ బుద్ధా వెంకన్నను నియమిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కోవడంలో వెంకన్న ముందుంటారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో ముందుండే వెంకన్న బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి.

పార్టీ వాణిని వినిపించడంలో వెంకన్న చురుగ్గా ఉంటున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు కొనియాడారు. అంశం ఏదైనా చొరవ తీసుకుని ప్రత్యర్థులను గుక్కతిప్పుకోనివ్వకుండా చేస్తున్నారని  పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆయనను పార్టీ అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. టీడీపీ స్పోక్స్ పర్సన్‌గా ఎన్నికైన బుద్ధాను నేతలు అభినందించారు.

More Telugu News