Guntur: మహిళలు మందుకొడుతూ.. పేకాడటం చూసి అవాక్కయిన పోలీసులు!

  • ఓ ఇంటిపై స్పెషల్ బ్రాంచ్ పోలీసుల దాడి
  • పురుషుల కంటే మహిళలే ఎక్కువ
  • రూ.5 లక్షల 60 వేల నగదు స్వాధీనం

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ ఇంటిపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు జరిపిన మెరుపు దాడిలో అవాక్కయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నివాస గృహాల మధ్య విచ్చలవిడిగా పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయని స్థానికుల ఫిర్యాదుతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఆ ఇంట్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ శాతం ఉండటం.. దర్జాగా మద్యం తాగుతూ పేకాట ఆడుతుంటడంతో పోలీసులే అవాక్కయ్యారు.

మొత్తం 13 మందిని అరెస్ట్ చేయగా, వారిలో నలుగురు పురుషులు, మిగిలిన వారంతా మహిళలే కావడం విశేషం. వారి వద్ద నుంచి రూ.5 లక్షల 60 వేలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. దాడిలో పట్టుబడ్డ మహిళలంతా హిజ్రాలతో స్నేహం కొనసాగిస్తున్నట్టు విచారణలో తేలింది.  

More Telugu News