mumbai: నాల్గో వన్డేలో టీమిండియా ఘన విజయం

  • వెస్టిండీస్ పై 224 పరుగుల తేడాతో గెలుపు
  • 36.2 ఓవర్లకే అన్ని వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టు
  • వెస్టిండీస్ స్కోర్: 153/9

ముంబై వేదికగా జరిగిన నాల్గో వన్డేలో వెస్టిండీస్ పై 224 పరుగుల తేడాతో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. 378 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు భారత్ బౌలర్ల ధాటికి కుప్పకూలింది. 36.2 ఓవర్లకే అన్ని వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టు 153 పరుగులు చేసింది. విండీస్ ప్లేయర్స్ లో కెప్టెన్ హోల్డర్ ఒక్కడే హాఫ్ సెంచరి చేశాడు. మిగిలిన ప్లేయర్స్ రాణించలేకపోయారు. కాగా, ఐదు వన్డేల సిరీస్ లో టీమిండియా 2-1 అధిక్యంలో ఉంది.

వెస్టిండీస్ స్కోర్: 153/9

టీమిండియా స్కోర్: 377/5

More Telugu News