nagachaitanya: 'సవ్యసాచి' విషయంలో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

  • ఓ ఆర్టికల్ నుంచి ఈ కథ పుట్టింది 
  • డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేశాను 
  • అన్ని వర్గాలవారికి నచ్చుతుంది  

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా 'సవ్యసాచి' సినిమా రూపొందింది. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా, నవంబర్ 2వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ .. 'సవ్యసాచి' ట్రైలర్ చూసినవాళ్లు .. 'హలో బ్రదర్' మాదిరిగా ఉందని అనుకుంటున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. ఆ  సినిమాకి .. ఈ సినిమాకి ఏ విషయంలోనూ పోలిక ఉండదు' అని క్లారిటీ ఇచ్చాడు.

కొన్ని సంవత్సరాల క్రితం 'వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్' గురించిన ఒక ఆర్టికల్ చదివాను. ఈ రకమైన సిండ్రోమ్ కలిగినవారికి ఒక చేయి అదుపులో ఉండదు. ఇది నాకు కాస్త చిత్రంగా అనిపించింది. ఈ పాయింట్ పై సినిమా చేస్తే బాగుంటుందని అనిపించింది. వెంటనే కథను రెడీ చేసుకుని వెళ్లి, చైతూతో పాటు నిర్మాతలకి వినిపించాను. అందరికీ నచ్చడంతో ప్రాజెక్టు పట్టాలెక్కింది. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ ప్రధాన అంశాలుగానే ఈ కొత్త కాన్సెప్ట్ ను తీర్చిదిద్దాను. అన్నివర్గాల వారికి ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.  

More Telugu News