vijay: అత్యధిక థియేటర్లలో సందడి చేయనున్న 'సర్కార్'

  • విజయ్ హీరోగా 'సర్కార్'
  • దీపావళికి ప్రేక్షకుల ముందుకు 
  • ప్రపంచవ్యాప్తంగా 1200 స్క్రీన్లలో రిలీజ్

విజయ్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో 'సర్కార్' చిత్రం నిర్మితమైంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమా, రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది. దీపావళి కానుకగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అత్యధిక థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితం కానుంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 1200 స్క్రీన్లలో విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతోన్న ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ ను రాబట్టనున్నట్టు సమాచారం. వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో మురుగదాస్ కూడా సరదాగా కొద్ది సేపు మెరవనున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. 'కత్తి' .. 'తుపాకి' తరువాత ఈ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమా, హ్యాట్రిక్ హిట్ కొడుతుందనేది అభిమానుల మాట.     

More Telugu News