Sharwanand: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • శర్వానంద్ తో సాయిపల్లవి పాట
  • మహేశ్ బాబు మల్టీప్లెక్స్ రెడీ 
  • మరోసారి హీరోగా వస్తున్న అలీ
  • రీమేక్ పనిలో దర్శకుడు  హరీశ్ 

*  శర్వానంద్, సాయి పల్లవి జంటగా రూపొందుతున్న 'పడిపడి లేచె మనసు' చిత్రం కోసం ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరిస్తున్న ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. హను రాఘవపూడి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
*  మహేశ్ బాబు థియేటర్ బిజినెస్ లోకి కూడా ప్రవేశిస్తున్నాడు. ఏసియన్ సినిమాస్ సంస్థతో కలసి ఆయన జాయింట్ వెంచర్ చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాదు గచ్చిబౌలిలో నిర్మించిన AMB సినిమాస్ మల్టీప్లెక్స్ ను నవంబర్ 8న ప్రారంభిస్తున్నారు.
*  గతంలో పలు చిత్రాలలో హీరోగా నటించిన ప్రముఖ హాస్య నటుడు అలీ మరోసారి హీరోగా రానున్నాడు. దిలీప్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న 'పాండుగాడి ఫొటో స్టూడియో' చిత్రంలో అలీ హీరోగా నటిస్తున్నాడు.
*  గతంలో 'దబాంగ్' చిత్రాన్ని 'గబ్బర్ సింగ్' పేరిట తెలుగులో రీమేక్ చేసిన దర్శకుడు హరీశ్ శంకర్, ఇప్పుడు మరో రీమేక్ ను చేస్తున్నారు. తమిళంలో వచ్చిన 'జిగర్తాండ' చిత్రాన్ని రీమేక్ చేసే పనిలో ప్రస్తుతం ఆయన వున్నారు.

More Telugu News