chatsigarh: బీజాపూర్ లో మావోయిస్టులు, సీఆర్పీఎఫ్ మధ్య ఎదురుకాల్పులు..నలుగురు జవాన్ల మృతి!

  • ముర్దొండి అటవీ ప్రాంతంలో ఘటన
  • గాలింపు చర్యలు చేపడుతుండగా ఎదురుపడ్డ మావోలు
  • కొనసాగుతున్న ఎదురుకాల్పులు

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు, సీఆర్పీఎఫ్ జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ముర్దొండి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా ఎదురుపడ్డ మావోయిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు ప్రతిఘటించారు. ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపుతున్నట్టు పోలీసుల సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

More Telugu News