pune: పూణే వన్డే.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

  • హోల్డర్ వేసిన బంతికి రోహిత్ శర్మ అవుట్
  • 8 పరుగులు చేసిన రోహిత్ శర్మ
  • పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 54/1

పూణే వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 1.6 వ ఓవర్ లో హోల్డర్ వేసిన బంతికి ఓపెనర్ రోహిత్ శర్మ (8) అవుటయ్యాడు.  ప్రస్తుతం క్రీజ్ లో ఉన్న శిఖర్ ధావన్ 20 పరుగులతో, విరాట్ కోహ్లీ 24 పరుగులతో కొనసాగుతున్నారు. పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 54/1.

కాగా, 284 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే తొలి వికెట్ కోల్పోవడం గమనార్హం. ఇప్పటివరకు భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండు వన్డేల్లో ఒకటి భారత్ సొంతం చేసుకోగా, మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. పూణే వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్ లో విజయం సాధించాలని రెండు జట్లు చూస్తున్నాయి.  

More Telugu News