sudheer babu: గోపీచంద్ బయోపిక్ కూడా రెండు భాగాలట!

  • తెరపైకి పుల్లెల గోపీచంద్ బయోపిక్ 
  • దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు 
  • రెండు భాగాలుగా అందించాలనే ఆలోచన

తెలుగు తెరపై ప్రస్తుతం బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. 'మహానటి' బయోపిక్ కి భారీస్థాయిలో రెస్పాన్స్ రావడంతో, చకచకా మరికొన్ని బయోపిక్ లకి సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సుధీర్ బాబు తాను నిర్మాతగా .. హీరోగా ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ ను రూపొందించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి దర్శకుడిగా ఆయన ప్రవీణ్ సత్తారును ఎంచుకున్నాడు.

ఈ సినిమా స్క్రిప్ట్ పైనే ప్రవీణ్ సత్తారు పనిచేస్తున్నాడు. 'గరుడ వేగ' తరువాత ఆయన చేస్తోన్న సినిమా ఇదే. పుల్లెల గోపీచంద్ బయోపిక్ ను రెండు భాగాలుగా అందించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. గోపీచంద్ బాల్యం .. విద్యాభ్యాసం .. బ్యాడ్మింటన్ దిశగా అడుగులు మొదటిభాగంలో చూపిస్తారట. రెండవభాగంలో బ్యాడ్మింటన్ ప్లేయర్ గా సాధించిన విజయాలు .. అనుభవాలను గురించి చూపిస్తారట. అయితే ఈ బయోపిక్ ఒక భాగంగా వస్తేనే బాగుంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 

More Telugu News