Bihar: రోడ్డు ప్రమాదంలో ఎంపీ వీణాదేవి కుమారుడు దుర్మరణం!

  • నోయిడా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం
  • అతి వేగమే కారణమని సమాచారం
  • శోకసంద్రంలో వీణాదేవి కుటుంబం

బీహార్ లోక్ జనశక్తి పార్లమెంట్ సభ్యురాలు వీణాదేవి కుమారుడు అశుతోష్ సింగ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, యూపీలోని నోయిడా ఎక్స్ ప్రెస్ హైవేపై అశుతోష్, తన వాహనంలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని సమాచారం.

మాజీ ఎంపీ సూరజ్ ఖాన్ భార్య వీణాదేవి కాగా, ఆమె ప్రస్తుతం ముంగేర్ ఎంపీగా ఉన్నారు. ఈ ఘటనతో వీణాదేవి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వీణాదేవి దంపతులను పలువురు రాజకీయ నేతలు పరామర్శించి, సంతాపం తెలిపారు. కాగా, గతంలో ఇదే పార్టీకి చెందిన మరో ఎంపీ రామ్ సింగ్ కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతిచెందారు.

More Telugu News