charan: 'రచ్చ' కోసం చివరికి చిరంజీవిగారే రంగంలోకి దిగిపోయారు!: పరుచూరి గోపాలకృష్ణ

  • 'రచ్చ' కథలో మార్పులు చేశాము 
  • ఎక్కడ ఏది చెప్పాలో అదే చెప్పాము 
  • ఆడియన్స్ కి కనెక్ట్ అయింది  

'రచ్చ' సినిమా కథ విషయంలో ఆసక్తికరమైన మార్పులు చేర్పులు చేస్తూ వచ్చాము. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తరువాత రష్ చూస్తే, సంపత్ నంది అనుకున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నిడివి చాలా ఎక్కువగా వచ్చింది. చిరంజీవి .. చరణ్ .. ఏ సీన్ తీసేస్తే ఏమనుకుంటారోనని మేము ఆలోచిస్తున్నాము. దాంతో చిరంజీవి గారు సెకండ్ యూనిట్ డైరెక్టర్ లా ఎడిటింగ్ లో కూర్చుని రష్ అంతా చూశారు.

ఈ సీన్ కట్ చేయండి .. ఈ షాట్ ఉంచండి అని ఆయన అంతా చెప్పేశారు. చిరంజీవి గారి సూచన మేరకు వాయిస్ ఓవర్ చేసుకుంటూ నిడివిని తగ్గించుకుంటూ వచ్చాము. దాంతో కథ వేగాన్ని పుంజుకుని చకచకా ముందుకు వెళ్లింది. కథలో ఎక్కడా జర్క్ రాకుండా కనెక్ట్ చేశాము. ఎక్కడ ఏ విషయాలను రివీల్ చేస్తూ రావాలో ఆ విషయాలను రివీల్ చేస్తూ రావడంతో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది" అని చెప్పుకొచ్చారు.    

More Telugu News