ys jagan: జగన్ పై దాడి ఘటన.. విచారణ కోరుతూ హైకోర్టులో వైవీ సుబ్బారెడ్డి పిటిషన్

  • హైకోర్టులో పిటిషన్ వేసిన వైవీ సుబ్బారెడ్డి
  • సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలి
  • ఈ పిటిషన్ పై సోమవారం విచారణ?

జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టును వైసీపీ ఆశ్రయించింది. ఈ ఘటనపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని కోరుతూ వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి  పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉన్నాయని, జగన్ పై కుట్ర జరుగుతోందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జి లేదా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. కాగా, జగన్ పై జరిగిన ఈ దాడిపై విచారణ కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) కూడా దాఖలైంది. 

More Telugu News