chaitu: 'సవ్యసాచి' కథ నా పాత్రతో మలుపు తిరుగుతుంది: నిధి అగర్వాల్

  • కాన్సెప్ట్ ఎంతగానో నచ్చింది 
  • చైతూ సహకారం మరువలేనిది 
  • నా కెరియర్ కి బాగా హెల్ప్ అవుతుంది    

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా 'సవ్యసాచి' నిర్మితమైంది. ఈ సినిమా ద్వారా నిధి అగర్వాల్ కథానాయికగా పరిచయమవుతోంది. నవంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ .. "నేను హిందీలో చేసిన 'మున్నా మైఖేల్' చూసి, ఈ సినిమా కోసం చందూ మొండేటి గారు సంప్రదించారు. కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశాను.

చందూ గారు నా పాత్రను చాలా బాగా మలిచారు. ఈ సినిమాలో నేను ఇండిపెండెంట్ గర్ల్ గా కనిపిస్తాను. నా పాత్ర కారణంగానే ఈ సినిమా కీలకమైన మలుపు తిరుగుతుంది. ఇక నటన విషయంలో చైతూ ఎంతో సహకరించారు. ఈ సినిమాలో నేను బాగా చేశానని ఎవరైనా అంటే, ఆ క్రెడిట్ చందూ .. చైతూలకు దక్కుతుంది. ఈ సినిమా నా కెరియర్ కి ఎంతో హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.   

More Telugu News