jagan: జగన్ పై దాడి ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్!

  • కాసేపట్లో పిటిషన్ ను విచారించనున్న హైకోర్టు
  • ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న జగన్
  • నేటి కోర్టు విచారణకు హాజరుకాలేకపోయిన జగన్

వైసీపీ అధినేత జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడికి యత్నించిన యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జగన్ చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ఈ దాడి విషయంలో సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ, హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను హైకోర్టు కాసేపట్లో విచారించనుంది. మరోవైపు, ఈ ఘటన నేపథ్యంలో, నేటి సీబీఐ కోర్టు విచారణకు జగన్ హాజరుకాలేకపోయారు. 

More Telugu News