Google: గూగుల్ సీరియస్: లైంగిక వేధింపులకు పాల్పడిన 48 మంది ఉద్యోగులపై వేటు!

  • లైంగిక వేధింపులకు పాల్పడిన వారిలో 13 మంది సీనియర్లు
  • తమ సంస్థలో మహిళలకు పూర్తి రక్షణ ఉంటుందన్న పిచాయ్
  • తొలగింపునకు గురైన వారికి ఎగ్జిట్ ప్యాకేజీ నో

మీటూ ఉద్యమ సెగ ఇప్పుడు గూగుల్‌కు పాకింది. ఆ సంస్థలోని 48 మంది ఉద్యోగులపై వేటు పడింది. వీరిలో 13 మంది సీనియర్ ఉద్యోగులు ఉండడం గమనార్హం. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా వెల్లడించారు. తమ సంస్థలో మహిళా ఉద్యోగులకు పూర్తి రక్షణ ఉందని పేర్కొన్న ఆయన.. వారి రక్షణకు గూగుల్ కట్టుబడి ఉందన్నారు. వేధింపులు ఎదుర్కొంటున్న వారు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే సంస్థ వారికి అండగా ఉంటుందని సుందర్ పిచాయ్ హామీ ఇచ్చారు. తాము తొలగించిన 48 మందిలో 13 మంది సీనియర్ ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు. విధుల నుంచి తొలగింపునకు గురైన వారికి ఎటువంటి ఎగ్జిట్ ప్యాకేజీ ఉండదని పేర్కొన్నారు.

More Telugu News