jagan: సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించాం: సురేశ్‌ ప్రభు

  • జగన్ పై దాడిని ఖండిస్తున్నాం
  • ఇప్పటికే సీఐఎస్ఎఫ్ విచారణ ప్రారంభమైంది
  • జగన్ కు ఇంచున్నర లోతు వరకు గాయమైనట్టు తెలిపిన వైద్యులు

వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని కేంద్ర విమానయాన మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఇప్పటికే సీఐఎస్ఎఫ్ విచారణ ప్రారంభమైందని తెలిపారు.

ఈ మధ్యాహ్నం హైదరాబాదుకు వస్తున్న సమయంలో ఎయిర్ పోర్ట్ లాంజ్ లో జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు పందెం కోడి కాళ్లకు కట్టే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆయన ఎడమ చేతిపై గాయం అయింది. హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. ఒకటిన్నర ఇంచు లోతు వరకు గాయమైనట్టు వైద్యులు తెలిపారు.

More Telugu News