governor: ఏపీ డీజీపీకి ఫోన్ చేసిన గవర్నర్.. పూర్తి నివేదిక పంపించాలంటూ ఆదేశం

  • జగన్ పై దాడి విషయమై ఫోన్ చేసిన గవర్నర్
  • ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావు లేదన్న జవహర్
  • విచారణ జరిపి, నిజాలను తేలుస్తాం

వైసీపీ అధినేత జగన్ పై ఓ యువకుడు దాడి చేసిన ఘటనపై గవర్నర్ నరసింహన్ స్పందించారు. వార్త తెలిసిన వెంటనే ఏపీ డీజీపీ ఠాకూర్ కు ఫోన్ చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను పంపాలని ఆదేశించారు. మరోవైపు ఈ దాడిని ఏపీ మంత్రి జవహర్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావు లేదని చెప్పారు. కేంద్ర బలగాల అధీనంలో ఉండే ఎయిర్ పోర్టులో దాడి ఎలా జరిగిందన్న దానిపై విచారణ జరిపి, నిజాలను తేలుస్తామని తెలిపారు. 

More Telugu News