jagan: సిటీ న్యూరో సెంటర్ కు వెళ్తున్న జగన్... తోడుగా భారతి

  • గట్టి భద్రత మధ్య సిటీ న్యూరో సెంటర్ కు బయల్దేరిన జగన్
  • భర్తకు తోడుగా ఉన్న భారతి
  • జగన్ కాన్వాయ్ తో పాటు వెళ్తున్న నేతలు, కార్యకర్తలు

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కత్తిపోటుకు గురైన వైసీపీ అధినేత జగన్ కాసేపటి క్రితం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి గట్టి భద్రత మధ్య నేరుగా నగరంలోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని సిటీ న్యూరో సెంటర్ కు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన భార్య భారతి ఆయన వెంట ఉన్నారు. మరోవైపు, జగన్ కాన్వాయ్ ను వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అనుసరిస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో జగన్ కు ప్రథమ చికిత్స చేశారు. 

More Telugu News