gvl narasimha rao: జగన్ పై దాడి అనుమానాలకు తావిస్తోంది: జీవీఎల్ నరసింహారావు

  • జగన్ పై దాడిని ఖండిస్తున్నాం
  • జ్యుడీషియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలి
  • దుండగుడిని కఠినంగా శిక్షించాలి

వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ దాడిని అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఖండించాలని చెప్పారు. ఎంతో సురక్షితమైన ఎయిర్ పోర్ట్ లో దాడి జరగడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని చెప్పారు. దాడికి యత్నించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, జగన్ పై దాడి జరిగిందనే వార్తతో వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. 

More Telugu News