Tamilnadu: సినిమా హీరోయిన్ ను చేస్తానని చెబితే నమ్మి సర్వస్వం అర్పించుకుని మోసపోయిన విద్యార్థిని!

  • బస్సుకోసం ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థిని  
  • ఖరీదైన కారులో వచ్చి నిర్మాతగా పరిచయం చేసుకున్న వ్యక్తి
  • నమ్మి రెండు సార్లు హోటల్ గదిలో ఏకాంతంగా గడిపిన యువతి
  • డబ్బు తీసుకుని ఉడాయించగా, కేసు నమోదు

తాను ఒక సినిమా నిర్మాతనని, నువ్వు చాలా అందంగా ఉన్నావని మాయమాటలు చెబితే, నమ్మిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని దారుణంగా మోసపోయింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, తిరుపోరూర్, పాత మహాబలిపురం ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని (25), గత నెల8వ తేదీన మరో ఊరు వెళ్లడానికి బస్టాండ్ లో నిలబడివుండగా, ఓ ఖరీదైన కారు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన ఓ వ్యక్తి, తాను సినీ నిర్మాతనని ఆమెను పరిచయం చేసుకున్నాడు.

తాను ఓ కొత్త సినిమాకు ప్లాన్ చేస్తూ, హీరోయిన్ ను వెతుకుతున్నానని, నువ్వు ఆ పాత్రకు సరిపోతావని చెబుతూ, నటిస్తారా? అని నమ్మకంగా అడిగాడు. ఆ సమయంలో ఆనందపడిపోయిన ఆమె, నటించేందుకు అంగీకరించగా, మాట్లాడుకుందామని చెబుతూ, తన కారులో మహాబలిపురం ప్రాంతానికి తీసుకెళ్లాడు.

అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకున్న ఆ వ్యక్తి, కథా చర్చలంటూ ఆమెను రంగంలోకి దించాడు. ఆమె కూడా అవకాశం కోసం అతనితో సన్నిహితంగా మెలిగింది. ఆపై అతను తిరిగి 17న కలుద్దామని, అప్పుడు కొంత డబ్బు తేవాలని కోరగా, ఆమె రూ. 60 వేలు తీసుకెళ్లి ఇచ్చింది. కారులో కోవై వెళ్లిన వారు, మరో గదిని తీసుకుని ఏకాంతంగా గడిపారు.

మరి, తన సినిమా చాన్స్ ఏమైందని ఆమె ప్రశ్నించగా, ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యాడా వ్యక్తి. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె, తన తల్లికి విషయం చెప్పి, పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో సెమ్మంజేరి పోలీసులు కేసు నమోదు చేసి, సదరు వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.

More Telugu News