Revanth Reddy: రేవంత్ కు భద్రత విషయమై కేంద్రాన్ని, ఈసీని ప్రశ్నించిన హైకోర్టు

  • రేవంత్ కు భద్రత దరఖాస్తును పట్టించుకోని కేంద్రం, ఈసీ
  • హైకోర్టును ఆశ్రయించిన రేవంత్
  • సంబంధిత వివరాలను అందించాలని కేంద్రం, ఈసీకి ఆదేశం 

కేంద్ర సిబ్బంది లేదా స్వతంత్ర సంస్థతో తనకు భద్రత కల్పించాలని కోరుతూ కేంద్ర హోం శాఖకు, ఈసీకి టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై వారు స్పందించకపోవడంతో హైకోర్టును ఇటీవల ఆయన ఆశ్రయించారు. ఈ అభ్యర్థనపై హైకోర్టు స్పందించింది.

పిటిషనర్ కు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిదంటూ కేంద్ర హోం శాఖను, ఈసీని ప్రశ్నించింది. అందుకు సంబంధించిన వివరాలు అందించాలని కేంద్రం, ఈసీ తరపు న్యాయవాదులను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. కాగా, తనకు రాజకీయ ప్రత్యర్థులు, సంఘ విద్రోహ శక్తులతో ప్రమాదం పొంచి ఉన్నందున నలుగురు సిబ్బందితో తనకు భద్రత కల్పించాలని రేవంత్ తన దరఖాస్తులో కోరారు.

More Telugu News