rajani: సంక్రాంతి బరిలోకి రజనీ - అజిత్ .. బయ్యర్లలో ఆందోళన!

  • 'పేట్టా'తో రానున్న రజనీ 
  • 'విశ్వాసం'తో వస్తోన్న అజిత్ 
  • రెండు సినిమాలపై భారీ అంచనాలు

రజనీకాంత్ కి తమిళనాట వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇక అజిత్ కి వున్న ఫాలోయింగ్ కూడా తక్కువేం కాదు. అలాంటి ఈ ఇద్దరి సినిమాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయనేది కోలీవుడ్ టాక్. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ 'పేట్ట' అనే సినిమా చేస్తున్నారు. రజనీ లుక్ .. విభిన్నమైన కథా కథనాలు ఈ సినిమాకి ప్రధానమైన బలమని చెప్పుకుంటున్నారు. ఇక అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో 'విశ్వాసం' నిర్మితమవుతోంది. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. సమన్వయ లోపం కారణంగా ఈ రెండు సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకే రోజున బరిలోకి దిగుతున్నాయి. దాంతో వసూళ్లపై ప్రభావం పడుతుందని బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు సినిమాల నిర్మాతలు మాట్లాడుకుని విడుదల తేదీలను మార్చుకోవాలని కోరుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి. 

More Telugu News