Andhra Pradesh: ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

  • పద్నాలుగు మంది అధికారుల బదిలీలు
  • బదిలీ అయిన అధికారుల్లో పలు జిల్లాల ఎస్పీలు  
  • ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. పద్నాలుగు మంది అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అట్టాడ బాబూజీ ( కడప ఎస్పీ)- విశాఖ రూరల్ ఎస్పీగా, రాజశేఖర్ (చిత్తూరు ఎస్పీ)- గుంటూరు రూరల్ ఎస్పీగా, ఐశ్వర్య రాస్తోగి (విశాఖ రూరల్ అడిషనల్ ఎస్పీ)- నెల్లూరు ఎస్పీగా, ఫకీరప్ప (విశాఖ లా అండ్ ఆర్డర్ )- కర్నూలు ఎస్పీగా, అభిషేక్ మహంతి (తిరుపతి  అర్బన్ ఎస్పీ)- కడప ఎస్పీగా, విక్రాంత్ పాటిల్ (పార్వతీపురం ఓఎస్డీ)- చిత్తూరు ఎస్పీగా, అన్బురాజన్ (చిత్తూరు ఓఎస్డీ)- తిరుపతి అర్బన్ ఎస్పీగా, రాహుల్ దేవ్ శర్మ (విశాఖ రూరల్ ఎస్పీ)- విశాఖ సిట్ కు, వెంకట అప్పలనాయుడు (గుంటూరు రూరల్ ఎస్పీ)- విజయవాడ లా అండ్ ఆర్డర్ కు, పీహెచ్ డీ రామకృష్ణ (నెల్లూరు ఎస్పీ)- సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ బ్యూరోకు, అద్మాన్ నయిం అస్మికు (కడప అడిషినల్ ఎస్పీ)- విశాఖ లా అండ్ ఆర్డర్ కు, గోపీనాథ్ జెట్టీ (కర్నూలు ఎస్పీ)- టీటీడీ సెక్యూరిటీ, విజిలెన్స్ కు, సిద్ధార్థ కౌశల్ (నర్సీపట్నం ఓఎస్డీ)- గుంతకల్లు రైల్వే ఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.    

More Telugu News