bellamkonda: రొమాంటిక్ హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్!

  • యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తోన్న శ్రీనివాస్ 
  • నిర్మాణంలో రెండు ప్రాజెక్టులు 
  • మూడవ ప్రాజెక్టుకి సన్నాహాలు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సాక్ష్యం' .. పరాజయం పాలైంది. దాంతో ఆయన తన తదుపరి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఆయన తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ నటిస్తోంది. ఇక శ్రీనివాస్ అనే యువ దర్శకుడితో కలిసి కూడా బెల్లంకొండ శ్రీనివాస్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలోనూ కథానాయిక కాజల్ కావడం విశేషం.

ఈ నేపథ్యంలోనే బెల్లంకొండ శ్రీనివాస్ మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేస్తున్నాడు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇప్పటివరకూ మాస్ కంటెంట్ తో కూడిన యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్, ఈ సినిమాలో రొమాంటిక్ హీరోగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.   

More Telugu News