pooja hegde: 'జిగేలు రాణి' విషయంలో నేను అనుకున్నట్టుగానే జరిగింది: పూజా హెగ్డే

  • జిగేల్ రాణి పాట విన్నాను 
  • హిట్ అవుతుందని అనిపించింది 
  • అందుకే అంగీకరించాను      

ఇప్పుడు స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తోన్న కథానాయికగా పూజా హెగ్డే కనిపిస్తోంది. పూజా ఇంతగా బిజీ కావడానికి కారణం, 'దువ్వాడ జగన్నాథం' అనే చెప్పాలి. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, పూజా నాజూకుదనానికి అంతా ఫిదా అయ్యారు. ఆ తరువాత ఈ సుందరి 'రంగస్థలం'లో చేసిన 'జిగేలు రాణి' ఐటెమ్ సాంగ్ అమాంతంగా క్రేజ్ ను పెంచేసింది.

ఈ సాంగ్ గురించి తాజాగా పూజా మాట్లాడుతూ, నన్ను 'జిగేలు రాణి' చేయమని చెప్పినప్పుడు ముందుగా పాట విన్నాను. జానపద గీతం తరహాలో వున్న ఈ పాట నాకు బాగా నచ్చింది. ఈ పాట జనంలోకి బాగా వెళుతుందనీ .. సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అనిపించింది. నాకు మంచి క్రేజ్ తెస్తుందని కూడా ఊహించాను. అందువల్లనే రెండో ఆలోచన లేకుండా ఈ పాట చేయడానికి అంగీకరించాను. ఈ పాట విషయంలో నేను ఏదైతే అనుకున్నానో .. అదే జరిగింది" అంటూ చెప్పుకొచ్చింది.      

More Telugu News