vajpayee: వాజ్ పేయి, అద్వానీ సిద్ధాంతాలను బీజేపీ విస్మరించింది: కరుణా శుక్లా

  • రాష్ట్రానికి రమణ్ సింగ్ చేసిందేమీ లేదు
  • రాజ్ నందగావ్ ను ఏమాత్రం అభివృద్ధి  చేయలేదు
  • ప్రజల పక్షాన పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నా

ఛత్తీస్ గఢ్ లో బీజేపీ తరఫున సీఎంగా ఉన్న రమణ్ సింగ్ పై, బీజేపీ దివంగత నేత వాజ్ పేయి మేనకోడలు కరుణా శుక్లా పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి రమణ్ సింగ్ చేసిందేమీ లేదని విమర్శించారు. పదేళ్లుగా రాజ్ నంద్ గావ్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రమణ్ సింగ్ ఆ నియోజకవర్గం అభివృద్ధికి ఏమాత్రం పాటుపడలేదని, ప్రజల పక్షాన పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. వాజ్ పేయి, అద్వానీ సిద్ధాంతాలను బీజేపీ విస్మరించిందని రాజ్ నందగావ్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న కరుణా శుక్లా దుయ్యబట్టారు.

More Telugu News