sharwanand: నేపాల్ భూకంపం నేపథ్యంలో సాగే ప్రేమకథ

  • హను రాఘవపూడి నుంచి మరో ప్రేమకథా చిత్రం 
  • డాక్టర్ పాత్రలో సాయిపల్లవి 
  • డిసెంబర్లో విడుదల

విభిన్నమైన కథలను ఎంచుకుని .. పాత్రలను విలక్షణంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు హను రాఘవపూడి సిద్ధహస్తుడు. ఆయన తాజా చిత్రంగా 'పడి పడి లేచె మనసు' రూపొందింది. శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా, డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. శర్వానంద్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించనున్న ఈ సినిమాలో, సాయిపల్లవి డాక్టర్ గా నటించింది. ఇప్పటి వరకూ ఇది ఒక కాలనీలో సాగే ప్రేమ కథ కావొచ్చని అంతా అనుకున్నారు. కానీ ఈ ప్రేమకథ వెనుక ఒక బలమైన నేపథ్యం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం నేపాల్ లో భారీ భూకంపం సంభంవించి, వేలమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని వేలమంది గాయాలపాలయ్యారు. ఈ భూకంపం నేపథ్యంలోనే ఈ ప్రేమకథా చిత్రం రూపుదిద్దుకున్నట్టుగా తెలుస్తోంది. విడుదల సమయం దగ్గర పడుతుండగా కథా నేపథ్యం బయటికి రావడం విశేషం. ఈ సినిమా తమ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని శర్వానంద్ .. సాయిపల్లవి భావిస్తున్నారు.     

More Telugu News