chaitu: 'సవ్యసాచి' నుంచి ట్రైలర్ వచ్చేస్తోంది

  • విభిన్నమైన కంటెంట్ తో సినిమా 
  • ఈ నెల 24న ట్రైలర్ 
  • వచ్చేనెల 2న సినిమా రిలీజ్

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా 'సవ్యసాచి' సినిమా రూపొందింది. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను నవంబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్ తో ఈ సినిమాను నిర్మించారు. విభిన్నమైన ఈ కథాంశం కొత్తగా వుండి అన్నివర్గాల ప్రేక్షకులను అలరించనున్నట్టు చెబుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో మరింత హైప్ తీసుకురావడానికిగాను, ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో, మాధవన్ ప్రతినాయకుడిగా నటించాడు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు .. ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని అంటున్నారు. ఈ సినిమా అయినా చైతూకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి. 

More Telugu News