West Godavari District: నెత్తురోడిన పశ్చిమ గోదావరి.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి!

  • తణుకు మండలం తేతలి వద్ద ఘటన
  • 8 మందికి తీవ్రగాయాలు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

పశ్చిమగోదావరి జిల్లాలో ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి తణుకు మండలం తేతలి వద్ద ఆయిల్ ట్యాంకర్ ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎదురెదురుగా వస్తున్న లారీ- ఆయిల్ ట్యాంకర్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News