West Bengal: 'నిర్భయ'ను గుర్తుకు తెచ్చిన ఘోర అత్యాచారం!

  • పశ్చిమ బెంగాల్ లో దారుణాతి దారుణం
  • బంధువైన మహిళపై వ్యక్తి క్రూరత్వం
  • అరెస్ట్ చేసిన పోలీసులు

పశ్చిమ బెంగాల్ లోని జల్పాయి గురి జిల్లాలో ఘోరాతి ఘోరమైన దారుణం జరిగింది. 2012లో దేశమంతా తీవ్ర సంచలనం సృష్టించిన 'నిర్భయ' ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. ఓ యువతికి బంధువైన వ్యక్తి, ఆమెపై క్రూరంగా ప్రవర్తించాడు. ఆమెపై అత్యాచారం చేసి, మర్మాంగంలో ఇనుప రాడ్డుతో పొడిచాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఆమెను సర్దార్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తుండగా, ఆమె ఇప్పుడు ప్రాణాల కోసం పోరాడుతోంది.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఆ యువతిని నిరంజన్ పట్ ప్రాంతంలోని ఓ చెరువు వద్దకు పిలిపించిన నిందితుడు, ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతనితో పాటు మరో యువకుడు కూడా ఉన్నాడని, అయితే, ఈ నేరంలో అతనికి సంబంధం లేదని చెప్పారు. అపస్మారక స్థితిలో పడివున్న మహిళను చూసిన ఓ రిక్షా కార్మికుడు ఆమెను ఇల్లు చేర్చాడని, ఆ సమయంలో ఆమె భర్త కూడా ఇంట్లో లేడని తెలిపారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని అన్నారు.

More Telugu News