Odisha: కుటుంబ కలహాల ఎఫెక్ట్.. భార్య, అత్తమామలపై పెట్రోల్ పోసి నిప్పటించిన యువకుడు!

  • తానూ మంటల్లోకి దూకి బలవన్మరణం
  • ఒడిశాలోని జగత్ సింగ్ పూర్ లో ఘటన
  • కేసు నమోదుచేసిన పోలీసులు

ఒడిశాలోని జగత్ సింగ్ పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో విసిగివేసారిపోయిన ఓ యువకుడు భార్యతో పాటు అత్తామామలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం కళ్లముందే భార్య చనిపోవడాన్ని తట్టుకోలేక అతను కూడా మంటల్లోకి దూకాడు. ఈ ఘటన జిల్లాలోని ఘనాపాటి గ్రామంలో చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో యువకుడు సహా నలుగురు సజీవదహనం అయ్యారు. మంటలను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకునేలోపే దారుణం జరిగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News