Keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కీర్తి సురేశ్ దర్శకత్వం కబుర్లు! 
  • బుల్లితెరకు దర్శకుడు సురేశ్ కృష్ణ 
  • గాయనిగా వస్తున్న సునీత కూతురు!
  • విఠలాచార్య పాత్రలో ప్రముఖ దర్శకుడు 

*  తనకు దర్శకత్వం అంటే ఎంతో ఇష్టమని చెబుతోంది కథానాయిక కీర్తి సురేశ్. "ఎందుకో తెలియదు, నాకు మొదటి నుంచీ డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. అందుకే షూటింగులో ఆయా దర్శకుల పని తీరు పరిశీలిస్తూ వుంటాను. ఖాళీ దొరికినప్పుడు స్క్రిప్ట్ కూడా రాసుకుంటూ వుంటాను. భవిష్యత్తులో మంచి దర్శకురాలిగా పేరు తెచ్చుకోవాలని వుంది' అని చెప్పింది.
*  'బాషా', 'మాస్టర్', 'ధర్మచక్రం' వంటి హిట్ చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు సురేశ్ కృష్ణ బుల్లితెరకు వస్తున్నారు. ఆయన తొలిసారిగా తెలుగులో 'జ్యోతి' పేరిట ఓ సీరియల్ కు దర్శకత్వం వహిస్తున్నారు. 'స్టార్ మా' చానెల్ లో ఈ సీరియల్ నేటి నుంచి ప్రసారం అవుతుంది.
*  ప్రముఖ గాయని సునీత కుమార్తె శ్రేయ గోపరాజు కూడా సింగర్ గా మారింది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రం ద్వారా ఆమెను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గాయనిగా పరిచయం చేస్తున్నారు.
*  క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ 'కథానాయకుడు'లో జానపద బ్రహ్మ విఠలాచార్య పాత్రలో నేటి ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

More Telugu News