jagapathibabu: రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా: 'అరవింద సమేత' సక్సెస్ మీట్ లో జగపతిబాబు ఉద్వేగభరిత ప్రసంగం

  • నా క్యారెక్టర్ బలంగా ఉండాలని బాలయ్య, తారక్ ఒత్తిడి చేశారు
  • బాలయ్యను, నిన్ను ఒకే స్టేజ్ పై చూడాలని ఉందని తారక్ తో చెప్పా
  • బాబాయ్ అంటే నాకు చాలా ఇష్టమని తారక్ చెప్పాడు

'అరవింద సమేత' సినిమా సక్సెస్ మీట్ లో జగపతిబాబు చేసిన ప్రసంగం అందరినీ హత్తుకుంది. సినిమా గురించి చెప్పడానికి ఏమీ లేదని... ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని ఎప్పుడో చెప్పానని ఆయన అన్నారు. రెండు విషయాలను తాను చెప్పాలనుకుంటున్నానని...  2010లో హీరోగా తన కెరీర్ అయిపోయిందని, 2012లో మా బాలయ్యబాబుతో  'లెజెండ్' సినిమాతో విలన్ గా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైందని చెప్పారు. బాలయ్య, తారక్ ఇద్దరిలో తనకు ఒకే లక్షణం కనపడిందని చెప్పారు. తన క్యారెక్టర్ బలంగా ఉండాలని బాలయ్య అప్పుడు డైరెక్టర్ పై ఒత్తిడి చేశారని... అదే పనిని తారక్ ఈ సినిమాలో కూడా చేశాడని తెలిపారు.

తనకు తెలియకుండా బాలయ్య ఒక మంచి పని చేశారని... అది బయటకు చెప్పలేనని జగపతిబాబు చెప్పారు. తారక్, త్రివిక్రమ్ లతో గదిలో కూర్చున్నప్పుడు కూడా ఒక మంచి విషయం జరిగిందని... దాన్ని కూడా బయటకు చెప్పుకోలేనని అన్నారు. 'నాన్నకు ప్రేమతో' సినిమా చేసేటప్పుడు తారక్ తో మాట్లాడుతూ... 'తారక్ నిన్ను, బాలయ్య బాబాయ్ ను ఒక స్టేజ్ మీద చూడాలని ఉంది' అని చెప్పానని తెలిపారు.

దానికి సమాధానంగా... 'బాబు.. ఆయన నా బాబాయ్ బాబు. ఆయనంటే నాకు చాలా ప్రేమ. ఆయనంటే నాకు చాలా ఇష్టం' అని చెప్పాడని అన్నారు. తానెప్పుడూ ఏ యాక్టర్ తోనూ ఫొటో దిగలేదని... ఈ రోజు కావాలనే ఇద్దరితో కలసి ఫొటో దిగానని చెప్పారు. నందమూరి ఫ్యామిలీ చాలా గొప్పదని, వారి అభిమానులు గొప్పవారని, అందరూ మంచిగా కలసి ఉండాలని తెలిపారు. అసలైన దసరా, దీపావళి ఇక్కడ కనిపిస్తోందని చెప్పారు. జగపతిబాబు మాటలతో అభిమానులు కేరింతలు కొట్టారు. 

More Telugu News