salmani khurshid: కేంద్రంలో కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి రావడం కష్టమే : సల్మాన్ ఖుర్షీద్

  • బీజేపీని ఓడించేందుకు భాగస్వామ్య పక్షాలన్నీ ఏకం కావాలి
  • త్యాగాలు, సీట్ల సర్దుబాటుకు సిద్ధపడాలి
  • భాగస్వామ్య పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుంది

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించాలని కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారంలోకి రావడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు భాగస్వామ్య పక్షాలన్నీ సిద్ధంకావాల్సి ఉందని చెప్పారు. ఈ క్రమంలో కొన్ని త్యాగాలు, సర్దుబాట్లకు కూడా సిద్ధపడాలని అన్నారు. త్యాగాలకు సిద్ధపడి కూటమి ఏర్పాటుకు కలసిరావాలని తెలిపారు. భాగస్వామ్య పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ ఎంత కృషి చేయాలో అంత చేస్తుందని చెప్పారు. 

More Telugu News