aravinda sametha: నందమూరి అభిమానులకు కన్నుల పండుగ.. ఒకే ఫ్రేమ్ లో బాబాయ్ అబ్బాయ్

  • ప్రారంభమైన 'అరవింద సమేత' సక్సెస్ మీట్
  • అబ్బాయిలతో కలసి వచ్చిన బాలయ్య
  • కేరింతలు కొట్టిన అభిమానులు

హైదరాబాదులోని శిల్పకళావేదికలో 'అరవింద సమేత' సక్సెస్ మీట్ సందడిగా కొనసాగుతోంది. ఈ వేడుకకు బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. బాబాయ్ తో కలసి అబ్బాయిలు తారక్, కల్యాణ్ రామ్ లు ఆడిటోరియంలోకి ప్రవేశించగానే నందమూరి అభిమానులు కేరింతలు కొట్టారు. విజిల్స్ కొడుతూ, నినాదాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మధ్యలో కూర్చోగా ఆయనకు అటూఇటుగా తారక్, కల్యాణ్ రామ్ లు కూర్చున్నారు. ఇద్దరితో బాలయ్య ఆప్యాయంగా మాట్లాడుతుండటం అందరినీ ఆకట్టుకుంది.

More Telugu News