charan: పవన్ బాబాయ్ సూచన.. రంగంలోకి దిగిన అబ్బాయ్!

  • తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్
  • ఒక గ్రామాన్ని దత్తత తీసుకోమంటూ చరణ్ కు సూచన
  • గ్రామాన్ని గుర్తించే పనిని తన టీమ్ కు అప్పగించిన చరణ్

తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర నష్టాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తన అన్న కుమారుడు రామ్ చరణ్ కు ఆయన ఒక సూచన చేశారు. తుపాను వల్ల దెబ్బతిన్న ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని బాగుచేయమని చెప్పారు. బాబాయ్ సలహా మేరకు అబ్బాయ్ వెంటనే కార్యరంగంలోకి దిగిపోయాడు. తన సేవలు ఏ గ్రామానికి ఉపయోగకరంగా ఉంటాయో... ఆ గ్రామాన్ని గుర్తించమని తన టీమ్ కు చరణ్ చెప్పాడు. వారు ఆ పని పూర్తి చేసిన తర్వాత, తాను ఏ గ్రామాన్ని దత్తత తీసుకోనుంది అధికారికంగా ప్రకటించనున్నాడు.

More Telugu News