damodara raja narasimha: 'దత్త హోమం' నిర్వహించిన దామోదర రాజనర్సింహ

  • తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి
  • పూజలు, ప్రార్థనలతో బిజీగా ఉన్న నేతలు
  • రాజమండ్రి కోటి లింగాల రేవులో హోమం నిర్వహించిన దామోదర

తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి ఎక్కువైంది. నేతలంతా ప్రజలను కలుసుకునే పనిలో పడ్డారు. పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికల ప్రచారపర్వం వేడెక్కింది. మరోవైపు, రకరకాల నమ్మకాలతో నేతలు పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎంగా పని చేసిన దామోదర రాజనరసింహకు కూడా భక్తి భావం చాలా ఎక్కువ. ఎన్నో సెంటిమెంట్లను ఆయన పాటిస్తుంటారు. తాజాగా, రాజమండ్రిలోని కోటి లింగాల రేవులో ఆయన 'దత్త హోమం' నిర్వహించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకే ఆయన ఈ హోమం చేసినట్టు చెప్పుకుంటున్నారు.

More Telugu News