paritala sunitha: లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తికి.. మజ్జిగ ప్యాకెట్ ఇచ్చే స్తోమత కూడా లేదా?: పరిటాల సునీత

  • తుపాను ప్రభావిత గ్రామాల్లో తిరిగాను
  • చంద్రబాబు సహాయక కార్యక్రమాలను అందరూ మెచ్చుకుంటున్నారు
  • ఇద్దరు వైసీపీ నేతలు కూడా చంద్రబాబును పొగిడారు

తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిన్న 12 గ్రామాల్లో తిరిగానని... ప్రజలు తనను ఎంతో ఆప్యాయతతో ఆహ్వానించారని మంత్రి పరిటాల సునీత తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న సహాయక కార్యక్రమాలను అందరూ మెచ్చుకుంటున్నారని... వైసీపీకి చెందిన ఇద్దరు నేతలు తన వద్దకు వచ్చి చంద్రబాబును పొగుడుతూ మాట్లాడారని చెప్పారు. సహాయక చర్యలు బాగా జరుగుతున్నాయని కొనియాడారని తెలిపారు.
జగన్ లాంటి ప్రతిపక్ష నేత ఉండటం మన దురదృష్టమని సునీత విమర్శించారు. పక్క జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన...  ఇంతవరకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదని మండిపడ్డారు. లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తికి... తుపాను బాధితులకు కనీసం మజ్జిగ ప్యాకెట్ ఇచ్చే స్తోమత కూడా లేదా? అని ప్రశ్నించారు.  

More Telugu News