Chandrababu: హైదరాబాదులోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు

  • చాలా రోజుల తర్వాత హైదరాబాదుకు విచ్చేసిన చంద్రబాబు
  • టీటీడీపీ నేతలతో భేటీ కానున్న బాబు
  • రాహుల్ గాంధీకి ఫోన్ చేసే అవకాశం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాదుకు విచ్చేశారు. జూబ్లీహిల్స్ లో ఉన్న తన నివాసానికి కాసేపటి క్రితం చేరుకున్నారు. కాంగ్రెస్, టీడీపీలు ప్రధాన భాగస్వాములుగా ఏర్పడిన తెలంగాణ మహాకూటమిలో ఇప్పటివరకూ సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాకపోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ టీడీపీ నేతలతో ఆయన భేటీకానున్నారు. వారితో మాట్లాడిన తరువాత, కాంగ్రెస్ తెలంగాణ నేతలు ఉత్తమ్ కుమార్, జానారెడ్డి తదితరులతో చంద్రబాబు మాట్లాడతారని, అవసరమైతే రాహుల్ గాంధీకి ఆయన ఫోన్ చేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు.

More Telugu News