Ramgopal Varma: ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు... నేను నిజం మాత్రమే చెబుతా: రామ్ గోపాల్ వర్మ

  • ఎన్టీఆర్ జీవితంలో శూన్యం ఏర్పడిన వేళ లక్ష్మీ పార్వతి ప్రవేశం
  • ఓదార్పును కోరుకుంటున్న భావోద్వేగ సమయమది
  • అయితే, అది నా అభిప్రాయమేనన్న రామ్ గోపాల్ వర్మ

దివంగత ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన మాట వాస్తవమేనని, అయితే, అది తన అభిప్రాయమని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. తాను నిర్మిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో నిజం మాత్రమే చెప్పాలని భావిస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన, ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని పరిస్థితుల కారణంగా ఓ రకమైన శూన్యం ఏర్పడిన వేళ, లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించారని, ఆ సమయంలో ఓదార్పును కోరుకుంటున్న మానసిక పరిస్థితుల్లో ఉన్న ఎన్టీఆర్, ఆమెను ఆహ్వానించారని వర్మ వ్యాఖ్యానించారు. ఓ భావోద్వేగ సమయంలో ఇది జరిగి ఉంటుందని తాను అభిప్రాయపడుతున్నానని అన్నారు. సమాజంలో ఎవరో ఏదో అన్నారని, తాను గుడ్డిగా పాటించే రకాన్ని కాదని, తనకు కళ్లున్నాయని చెప్పిన వర్మ, పెళ్లయిన తరువాతే జ్ఞానోదయం అయిందని చెప్పారు.

More Telugu News