Srikakulam District: యువకుడిని ఢీకొన్న పవన్ కల్యాణ్ కాన్వాయ్.. ఆగ్రహంతో వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు!

  • శ్రీకాకుళం జిల్లా బోరుభద్ర గ్రామంలో ఘటన
  • కాలును తొక్కించుకుంటూ వెళ్లిన జనసేన కారు
  • చివరికి నేతల హామీతో మెత్తబడ్డ గ్రామస్తులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి ప్రాంతంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న బోరుభద్ర గ్రామం వద్ద పవన్ కాన్వాయ్ తేజ అనే యువకుడిని ఢీకొంది. ఈ సందర్భంగా కాన్వాయ్ లోని ఓ కారు యువకుడి కాలు మీదుగా వెళ్లడంతో అతను నొప్పితో విల్లవిల్లాడిపోయాడు.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు జనసేన కాన్వాయ్ ను అడ్డుకున్నారు. అనంతరం తేజను మండలంలోని ప్రాథమిక ఆసుపత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలో జనసేన నేతలు, సీఐ నవీన్ కుమార్ తేజను మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తీసుకువెళతామని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో చివరికి తేజను జనసేన నాయకులు తమ వాహనంలో శ్రీకాకుళం తరలించారు.

More Telugu News