Kurnool District: కర్నూలు జిల్లాలో నాటు బాంబుల కలకలం.. పరారీలో వైసీపీ నేత!

  • మల్లేపల్లి గ్రామంలో పోలీసుల తనిఖీలు
  • నాటు బాంబులు స్వాధీనం
  • ప్రత్యర్థులపై దాడికేనని అనుమానం

కర్నూలు జిల్లా పత్తికొండలో నాటు బాంబులు కలకలం రేపాయి. జిల్లాలోని మల్లేపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నేత అనంతరెడ్డికి చెందిన గడ్డివాములో పోలీసులు ఈ రోజు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో అనంతరెడ్డి పొలాల్లో తనిఖీలు చేపట్టామనీ, ఈ సందర్భంగా ఓ ప్లాస్టిక్ పెయింట్ డబ్బాలో దాచిన నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నామని సీఐ రాజగోపాల్ నాయుడు తెలిపారు.

గత నాలుగు రోజులుగా అనంతరెడ్డి ఊరిలో లేడనీ, ఆయనపై పాత కేసులు చాలా ఉన్నాయని వెల్లడించారు. ప్రత్యర్థులను హతమార్చడానికే అనంతరెడ్డి ఈ బాంబులను దాచిపెట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. బాంబులు బయటపడ్డ నేపథ్యంలో పోలీసులు అనంతరెడ్డి కోసం గాలింపును ముమ్మరం చేశారు.

More Telugu News