Kadapa District: అటవీశాఖ అధికారులకు షాకిచ్చిన స్మగ్లర్లు.. కిటికీ ఊచలు తొలగించి జంప్!

  • కడప జిల్లా రాజంపేటలో ఘటన
  • 11 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసిన అధికారులు
  • అందరూ తమిళనాడు వాసులేనని వెల్లడి

ఎర్రచందనం దొంగలు అటవీశాఖ అధికారులకు షాక్ ఇచ్చారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య బంధించినప్పటికీ కిటీకీ ఊచలు తెంపి చల్లగా జారుకున్నారు. అందరూ పారిపోయేవరకూ కూడా అధికారులెవరూ వీరిని పట్టించుకోలేదు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని రాజంపేట అటవీ అధికారులు ఇటవల నిర్వహించిన దాడుల్లో తమిళనాడుకు చెందిన 11 మంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను తరలిస్తూ దొరికిపోయారు. దీంతో వీరిని అధికారులు కస్టడీలోకి తీసుకుని కేసు నమోదుచేశారు.

అనంతరం అటవీశాఖ భవనంలోని ఓ గదిలో వీరిని బంధించారు. అయితే వీరిని పట్టించుకోవడం మానేశారు. దీంతో స్మగ్లర్లు కిటికీ ఊచలను వంచి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో తలలు పట్టుకోవడం జిల్లా అధికారుల వంతయింది.

More Telugu News