sabarimala: శబరిమల కొండపైకి వచ్చా.. నేను గెలిచాను: హైదరాబాద్ పాత్రికేయురాలు కవిత

  • ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించిన మహిళలు
  • 18 మెట్ల వద్ద అడ్డుకున్న భక్తులు
  • ఆలయంలోకి తీసుకెళ్లలేమని చెప్పిన అధికారులు

శబరిమల కొండపై ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఆలయంలోకి ప్రవేశించేందుకు కొందరు మహిళలు చేసిన ప్రయత్నాన్ని భక్తులు అడ్డుకున్నారు. వారికి భద్రతగా వచ్చిన పోలీసులను సైతం అడ్డుకున్నారు. దీంతో, బలవంతంగా ఆలయంలోకి తీసుకెళ్లలేమని అధికారులు వారికి చెప్పారు. ఈ నేపథ్యంలో, హైదరాబాదుకు చెందిన పాత్రికేయురాలు కవిత, సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాలు అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, కొండపైకి రావడం సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపారు. కొండపైకి వెళ్లే విషయంలో తాను గెలిచానని చెప్పగలనని అన్నారు. కొన్ని రోజుల తర్వాత తప్పకుండా మళ్లీ శబరిమలకు వస్తానని చెప్పారు. ఈ అంశంపై ఐజీ స్థాయి పోలీసు అధికారి మాట్లాడుతూ, మహిళలను ఆలయంలోకి వెళ్లకుండా భక్తులు అడ్డుకున్నారని.... ఆలయం తలుపులు మూసేస్తానని ఆలయ ప్రధాన పూజారి హెచ్చరించారని... దీంతో, మహిళలు అక్కడి నుంచి వెనుదిరిగారని చెప్పారు. 

More Telugu News