Sabarimala: మహిళా జర్నలిస్టుకు హెల్మెట్, ప్రత్యేక బులెట్ ఫ్రూఫ్ ను ఇచ్చిన పోలీసులు... మరికాసేపట్లో అయ్యప్ప దర్శనం!

  • క్యూలైన్లోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు
  • బందోబస్తుగా 100 మంది పోలీసులు
  • దర్శనం చేయిస్తామంటున్న అధికారులు

అతివ చరిత్ర సృష్టించనుంది. శతాబ్దాలుగా ప్రవేశంలేని అయ్యప్ప సన్నిధికి ఇద్దరు మహిళలు మరికాసేపట్లో వెళ్లనున్నారు. దాదాపు 100 మంది పోలీసుల పహారా మధ్య కేరళకు చెందిన కవిత, హైదరాబాద్ కు చెందిన జర్నలిస్టు, పంబను దాటి అయ్యప్ప ఆలయం వరకూ వెళ్లారు. వీరి వెంట బందోబస్తుగా నిలిచిన వంద మంది పోలీసులు కూడా క్యూలైన్లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది.

పంబానది నుంచి వీరు నడక మార్గం గుండా సన్నిధానానికి బయలుదేరిన వేళ, జర్నలిస్టుకు తాము ధరించిన ప్రత్యేక దుస్తులను, బులెట్ ఫ్రూఫ్ జాకెట్ ను, హెల్మెట్ ను ఇచ్చిన పోలీసులు, ఆమెకు జాగ్రత్తలు చెబుతూ కొండను ఎక్కించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా కోర్టు ఆదేశాల మేరకు వీరికి దర్శనం చేయిస్తామని అధికారులు చెబుతుంటే, ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్ర నెలకొని వుంది.

More Telugu News