Kurnool District: తాళాలు వేసిన అమ్మవారి గుడిలో అర్ధరాత్రి మహిళ ప్రదక్షిణలు... సీసీటీవీ ఫుటేజ్ చూసి అమ్మవారేనంటున్న భక్తులు!

  • కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఘటన
  • పసుపు చీరతో మహిళ ప్రదక్షిణలు
  • వైరల్ అవుతున్న దృశ్యాలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఒకటి ఇప్పుడు కలకలం రేపుతోంది. అమ్మవారి ఆలయానికి రాత్రి వేళలో తాళాలు వేసిన తరువాత, ఓ మహిళ పసుపు పచ్చని చీరతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.

 జ్వాలాముఖి ఆలయాన్ని తాము రాత్రి 10 గంటలకే మూసేశామని, ఆ తరువాత ఆలయం లోపల ఎవరూ ఉండే అవకాశం లేదని నిర్వాహకులు చెబుతుండగా, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది స్వయంగా అమ్మవారేనని భక్తులు అంటున్నారు. రాత్రిపూట తమకు గజ్జెల చప్పుడు కూడా వినిపించిందని చుట్టుపక్కల ఉన్న కొందరు చెబుతున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి వైరల్ కావడంతో ఈ ఉదయం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

More Telugu News